అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. వైశాలి నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కాలనీలో మిగతా అసంపూర్తి రోడ్లను త్వరలోనే వేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రతాప్, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ మానస మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వైశాలి నగర్ ప్రెసిడెంట్ బంగారు బాబు, వైస్ ప్రెసిడెంట్ సురేష్, జనరల్ సెక్రటరీ దుర్గ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ బాలకృష్ణ, ట్రెజరర్ శ్రీనివాస రావు, మెంబర్లు ప్రవీణ్, గోపి కృష్ణ, శ్రీనివాస రెడ్డి, మనోజ్ కుమార్, శేషి ప్రసాద్, దిలీప్, గణేష్, వెంకట రెడ్డి, శ్రీనివాస్, దామోదర్, రమణయ్య, రంగారావు, కోటేశ్వరరావు, విశ్వేశర రావు, మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here