పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు.

పట్టణ ప్రగతిలో చెత్తను తొలగింపజేస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బొల్లారం చౌరస్తా, మియాపూర్ విలేజ్ లో పట్టణ ప్రగతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీల్లో, కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించడం జరుగుతుందని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ డ్రమ్ములు, కూలర్ లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా, రాంచందర్ గౌడ్, జిహెచ్ఎంసి, అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ లో పర్యటిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here