శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కి కొత్తగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయాలని ఫాం -18 పత్రాలను మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవ రావు, చందానగర్ టీఆర్ఎస్ యువనేత మిరియాల ప్రీతమ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పట్టభద్రులు విధిగా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
