హోప్ ఫౌండేషన్ సేవ‌లు అభినంద‌నీయం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చందానగర్ డివిజన్ కి చెందిన కూరగాయల వ్యాపారి ఓం ప్రకాష్ జోషి కి హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంగా రూ.5వేల‌ చెక్కును ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కూరగాయల వ్యాపారి ఓం ప్రకాష్ జోషికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు.

కూర‌గాయ‌ల వ్యాపారి ఓం ప్ర‌కాష్ జోషికి రూ.5వేల చెక్కును అందజేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్

హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్ సామజిక కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. సమాజం కోసం ఏదో చేయాలనే తపన వల్ల‌ సమాజ హితం జ‌రుగుతుంద‌ని తెలిపారు. సమాజ సేవ చేయడం చాలా గొప్ప విషయం అని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్‌ ని ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరూ సమాజం కోసం చేయూతనందించాలని గాంధీ పేర్కొన్నారు. సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేయడానికి ముందుకురావడం అభినందించ దగ్గ విషయం అని, ప్రతి ఒక్కరూ కొండా విజయ్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఎంతో మందికి ఆయ‌న‌ ఆదర్శప్రాయులుగా నిలిచారని, సమాజానికి సేవ చేయడానికి కొండా విజయ్ ఎల్లవేళలా ముందు ఉంటారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here