- కాంగ్రెస్ పార్టీలో చేరిన పూజిత జగదీశ్వర్ గౌడ్ దంపతులు
- కండువా కప్పి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్లకు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు వి. పూజిత జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం కార్యకర్తలతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన జగదీశ్వర్ గౌడ్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని గాంధీభవన్ కు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జగదీశ్వర్ గౌడ్ పూజిత దంపతులకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
జగదీశ్వర్ గౌడ్ దంపతుల రాకతో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగబోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్ నియోజకవర్గం ఇక హస్తగతం కానుందని అన్నారు.