శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ 8వ బెటాలియన్ పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ రక్తపు జంగం గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లావణ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






