శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్యాగం ,దయ ,సాహనుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ పర్వదినం ముగిసిన తర్వాత ఆత్మీయ కలయికనే ఈద్ మిలాప్ కార్యక్రమం అంటారని, ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ,అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జమయిత్ ఉల్ అన్సార్ శేరిలింగంపల్లి ఈద్ మిలాప్ సెలెబ్రేషన్స్ ప్రెసిడెంట్ మసూద్ అలీ మహ్మద్ , జనరల్ సెక్రటరీ మహ్మద్ అజిజ్ ఉల్ హాక్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అక్రముద్దీన్, మహ్మద్ జాఫర్ అహ్మద్, ట్రెజరర్ మహ్మద్ షబీర్ అహ్మద్, మహమ్మద్ బేగ్, అక్బర్ ఖాన్, యూసఫ్, అంజాద్, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.