స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి

– కార్పొరేట‌ర్ సాయిబాబాకు గోపన్ పల్లి వీకర్ సెక్షన్ వాసుల విన‌తి

గచ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని గోపన్ పల్లి వీకర్ సెక్షన్ కాలనీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబాకు కాల‌నీవాసులు బుధ‌వారం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 రోజులు నుంచి నీళ్లు సరిగా రావడం లేదని అన్నారు. సీసీ రోడ్డును నిర్మించాల‌ని కోరారు.

కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబాకు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న గోపన్ పల్లి వీకర్ సెక్షన్ వాసులు

ఇందుకు స్పందించిన కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ.. తప్పకుండా నీరు, రోడ్డు, కాలనీలో నెలకొన్న అన్ని సమస్యల‌ను పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో నీటి సమస్య కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అలాగే సీసీ రోడ్డు పనుల కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి మరో వారంరోజుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామ‌ని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here