జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ పై నేతాజీనగర్ లో అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లో సఫాయి మిత్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ వారు ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నేతాజీ‌‌ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంకులు నిండినప్పుడు ప్రైవేటు వాహనాలతో శుభ్రం చేయించడం ద్వారా డబ్బులు వృథా చేసుకోవడంతో పాటు కలుషిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. జలమండలి అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 155313/144230 కి కాల్ చేస్తే కేవలం రూ. 500 లకే శుభ్రం చేస్తారన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ పై కాలనీ ప్రతినిధులు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నేతాజీ నగర్ కాలనీ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, టి.కుమార్ ముదిరాజ్, బాల్ రాజ్ నాయక్, రమేష్ గుప్తా, శంకర్ నాయక్, గురువయ్య, చారి, ఎండి సలీం, శివ, రాజు, విష్ణు కుమార్, ప్రజాహిత వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రతినిధి కొండపల్లి జయశంకర్, సిబ్బంది అరుణ, పద్మమ్మ, తులసమ్మ, పార్వతమ్మ పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here