- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 100 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వివేకానందనగర్ డివిజన్ తెరాస నాయకుడు రామ్ చందర్ రావు ఆదివారం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఓటరు నమోదుకు గడువు సమీపిస్తున్నందున కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. శేరిలింగంపల్లిలోని ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు పాల్గొన్నారు.