కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు కోడిగుడ్ల పంపిణీ

హైద‌ర్‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ర‌వికుమార్ యాద‌వ్ ఆదేశాల మేర‌కు ఆదివారం నిజాంపేట రోడ్డు వ‌ద్ద పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కోడిగుడ్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా నియోజకవర్గ అధికార ప్రతినిధి బొల్లేపల్లి సీతారామరాజు మాట్లాడుతూ.. క‌రోనా నేప‌థ్యంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాల‌న్న ఉద్దేశంతో వారికి గుడ్ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు ర‌వికు‌మార్ యాద‌వ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు గుడ్ల‌ను పంపిణీ చేస్తున్న బొల్లేపల్లి సీతారామరాజు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here