నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ వాసులు సీఆర్పీఎఫ్ వల్ల తరచూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఢిల్లీలోని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రివర్యులు రేణుకా సింగ్ కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, తండావాసులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రివర్యులు రేణుకా సింగ్ ను బిజెపి నాయకులు, నడిగడ్డ తండా వాసులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ కలిసి వినతి పత్రం అందజేశారు. నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ సమస్యలపై, ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న సీఆర్పీఎఫ్ సమస్యలపై వివరించినట్లు తెలిపారు. ఈ విషయంపై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించి ఈ సమస్యపై సమయం తీసుకొని శాశ్వత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ మోర్చా నాయకులు అమర్ సింగ్ పవర్, నాయకులు తిరుపతి, రత్నకుమార్, హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
