నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లోని మంజీరా డైమండ్ టవర్స్ వద్ద రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెప్పారు. మంజీరా డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నైర్ విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి సమస్య పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఆయన వెంట ఏఈ కృష్ణవేణి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కోశాధికారి రమేష్ సోమిశెట్టి, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, మంజీరా డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నైర్, సీనియర్ నాయకులు వెంకటేష్. నర్సింగ్ నాయక్, ప్రభాకర్, శేఖర్, ప్రకాష్, రంగస్వామి, సురేష్, శ్రీకాంత్, క్రాంతి, కాలనీ వాసులు స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/09/IMG-20210908-WA0046.jpg)