గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నడిపూడి రఘునాథ్ యాదవ్ లు అభినందనలు తెలియజేశారు. రెండో విడతగా సంక్రాంతి పండుగ కానుకగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రకటించినందుకు అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా సంఘం సభ్యులందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.






