గంగు భానుమూర్తికి బ్రాహ్మణ‌ పరిషత్ నివాళి

న‌ల్ల‌కుంట (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ బ్రాహ్మణ‌ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు భానుమూర్తి సంతాప సభను న్యూ నల్లకుంటలో శ్రీ సీతారామంజనేయ సరస్వతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, అర్చక ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని గంగు భానుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావు, మంత్రి సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

గంగు భానుమూర్తికి నివాళులు అర్పిస్తున్న లక్ష్మణ్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here