పండిత్ దీన్ ద‌యాళ్‌కు బీజేపీ నాయ‌కుల ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా హైదర్ నగర్, లింగంపల్లి డివిజన్ల‌లో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాంనరేష్ నగర్, తారా నగర్, లింగంపల్లిల‌లో అధ్యక్షుడు నవీన్ గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎంతోమందికి మార్గదర్శకుడు, కడు పేదరికంలో పుట్టి ఆత్మవిశ్వాసంతో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి, అని కొనియాడారు. తన ఆశయం కోసం, దేశం కోసం సర్వస్వం అర్పించిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, మహిపాల్ రెడ్డి, బుచ్చి రెడ్డి, రామ్ రెడ్డి, వీరాచారి, సునీల్ రెడ్డి, కృష్ణం రాజు, రమేష్, వెంకట్, మల్లికార్జున్ రెడ్డి, శాంతిభూషణ్ రెడ్డి, మల్లేష్, శేషయ్య, నాగిరెడ్డి, బాలకృష్ణ, కృష్ణ, శ్రీను, అంబదాస్, బ‌ద్రి, సాయి, బాలాజీ, శ్రీను, రాజేష్, హరి, మహేష్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

దీన్ ద‌యాళ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here