శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ను శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ రమేష్తో వారు భేటీ అయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.






