భేరి రాంచంద‌ర్ యాద‌వ్ కు ఆస్రా సంస్థ స‌న్మానం

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నేతాజీన‌గ‌ర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భేరి రాంచంద‌ర్ యాద‌వ్‌ను ఆస్రా సంస్థ స‌న్మానించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రామ‌చంద‌ర్ యాద‌వ్‌ను ఆస్రా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు హ‌బీబ్ సుల్తాన్ అలీ ఆస్రా స‌న్మానించారు. క‌రోనా స‌మ‌యంలో భేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్టు త‌ర‌ఫున‌ పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తూ వారికి అండ‌గా నిలిచినందుకు గాను రామ‌చంద‌ర్ యాద‌వ్‌ను స‌న్మానించిన‌ట్లు తెలిపారు.

భేరి రాంచంద‌ర్ యాద‌వ్‌ను స‌న్మానించిన ఆస్రా సంస్థ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు హ‌బీబ్ సుల్తాన్ అలీ ఆస్రా

ఈ సంద‌ర్భంగా హ‌బీబ్ సుల్తాన్ అలీ అస్రా మాట్లాడుతూ ప్రజలందరికీ అస్రా సంస్థ న్యాయ స‌హాయం అందించేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఎవ‌రికైనా స‌హాయం కావ‌లిస్తే సంస్థ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ప్రశాంత్ యాదవ్ కు 9030045573 అనే నంబ‌ర్‌కు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆస్రా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు మగ్గినూరి సురేందర్, ఉపాధ్యక్షుడు గొర్ల ప్రశాంత్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here