శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పలు సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను, ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 11 దరఖాస్తులు రాగా, మిగిలిన ఏ విభాగంలోనూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు తెలపారు. ఈ క్రమంలో ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.






