శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జిన్నారంకు చెందిన పలువురు PRTUTS నాయకులు పాల్గొన్నారు. PRTUTS జిన్నారం మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు, జిల్లా, రాష్ట్ర నాయకులు ఈ ధర్నాలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.






