నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కొండాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆత్మారాం, నీలం కృష్ణ ముదిరాజ్ ,మన్నెంకొండ సాగర్, మేరీ , వినీత సింగ్, శ్రీకాంత్ గంప, ప్రవీణ, ప్రకాష్ అరోరా, అశోక్ కుమార్, హరీష్ సాగర్, వెంకటేష్, కృష్ణ రాం సుతార్, తదితరులు పాల్గొన్నారు.