పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ప్రభుత్వ విప్ గాంధీ

  • 109 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ చెక్కులు పంపిణీ

 

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్ , చందానగర్, భారతి నగర్ నగర్ డివిజన్ల పరిధిలోని 109 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా ఒక 1 కోటి 9 లక్షల 12 వేల 644 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా పంపిణీ చేశారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గాంధీ కార్పొరేటర్లు  ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు అశోక్ గౌడ్, రవీందర్ ముదిరాజ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉట్ల కృష్ణ, లక్ష్మారెడ్డి, అన్వర్ షరీఫ్, గంగాధర్ రావు, రాంచందర్, దొంతి శేఖర్, అక్తర్, సురేందర్, చింత కింది రవీందర్, శ్రీనివాస్ గోపారాజు, తిరుపతి, రజినీకాంత్, దామోదర్ రెడ్డి, మహ్మద్ కాజా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here