ప్రజలకు అందుబాటులో ఉంటాం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలు పొంగి పొర్లి, మురుగు, వరద పెద్ద ఎత్తున పారుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ముంపుకు గురైన నాల పరివాహక కాలనీలో, లోతట్టు ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలసి పర్యటించి సమస్యలను పరిశీలించారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్, అపార్ట్ మెంట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్, జూబ్లీ గార్డెన్ కాలనీలో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ప్రజలు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here