కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్సూరెన్స్ క్లేమ్స్ కమిటీ సేవలను అభినందించిన మాణిక్యం ఠాగూర్ 

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద భీమను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో గత 4 నెలల్లో ప్రమాదశావత్తు మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మల్లు రవి తదితర పార్టీ నాయకులు రూ.2 లక్షల చెక్ లను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మణిక్యం ఠాగూర్, ఇన్సూరెన్స్ క్లైమ్స్ అండ్ బూత్ ఎన్ రోలర్స్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాది, రాష్ట్ర కోఆర్డినేటర్, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ సామ్యూల్ కార్తిక్, కమిటీ సభ్యులు అందించిన సేవలను కొనియాడిన మాణిక్యం ఠాగూర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

సామ్యూల్ కార్తీక్ ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మణిక్యం ఠాగూర్,
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here