చిన్నారి చికిత్సకు ‘హోప్’ చేయూత

నమస్తే శేరిలింగంపల్లి : జహీరాబాద్ కు చెందిన సురేశ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి భెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సురేశ్ దంపతులకు నాగసహస్ర (3) జెనిటిక్ (వెన్నుపూస) ఎదుగుదల సమస్యతో బాధ పడుతుంది. చికిత్స నిమిత్తం రూ.2 లక్షల 50 వేలు అవసరం ఉండటంతో.. హోప్ ఫౌండేషన్ ఆదుకున్నది. శనివారం హుడా కాలనీలోని హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆ ఫౌండేషన్ చైర్మన్ రూ. 30 వేలు అందజేశారు. నాగసహస్ర చికిత్స నిమిత్తం స హాయం అందజేయడం కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని సురేశ్ కోరారు. కార్యక్రమంలో లయన్ సభ్యుడు మధుసూదన్ రెడ్డి, పోచి రెడ్డి పాల్గొన్నారు.

చిన్నారి నాగసహస్ర తల్లిదండ్రులకు రూ. 30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here