మా బంధువులతో ప్రాణహాని ఉంది

సిపి సజ్జనార్ ను కలిసిన హేమంత్ కుటుంబ సభ్యులు

సజ్జనార్‌ను కలిసిన హేమంత్‌ కుటుంబ సభ్యులు 
సిపి సజ్జనార్ కు వినతిపత్రం అందజేస్తున్న అవంతి, హేమంత్ తండ్రి మురళీకృష్ణ

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): కుటుంబ సభ్యులు, బంధువుల నుండి తనతో పాటు తన అత్త మామలకు ప్రాణహాని ఉంది అని ఇటీవల హత్యకు గురైన హేమంత్‌ భార్య అవంతి ఆరోపించారు. కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అవంతి తో పాటు హేమంత్ తల్లిదండ్రులు బుధవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హేమంత్‌ హత్య తరువాత జరిగిన పరిణామాలను సీపీకి వెల్లడించారు.

ఈకేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరూ తప్పించుకునే అవకాశం లేదని, నిందితులకు త్వరలోనే శిక్ష పడేలా చూస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల హత్యకు గురైన హేమంత్‌ కేసు విచారణకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని సీపీ వీసీ సజ్జనార్‌ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here