చిన్నారుల్లో సృజనాత్మక వెలికితీతకు వార్షికోత్సవాలు దోహదం: డాక్టర్ నామినేని శ్రీనివాస్

  • శిల్పకళా వేదికలో గౌతమి విద్య క్షేత్ర పాఠశాల వార్షికోత్సవం
  • అలరించిన చిన్నారుల నృత్యాలు, నాటక ప్రదర్శన
దశావతారాలు నాటక ప్రదర్శనలో చిన్నారులు

నమస్తే శేరిలింగంపల్లి: మదీనగూడలోని గౌతమి విద్య క్షేత్ర పాఠశాల వార్షికోత్సవం మాదాపూర్ శిల్పకళా వేదికలో వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ నామినేని శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం పిల్లలలో దాగున్న సృజనాత్మకతను నైపుణ్యాలను వెలికి తీస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు చేసిన కార్టూన్ నృత్యాలు, రైతుల ఆత్మహత్యలపై డ్రామా, దశావతారాల విశిష్టతను వివరిస్తూ చేసిన విన్యాసాలు అతిథులను ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్లు అరవింద్ రెడ్డి, శ్వేతా రెడ్డి, ప్రిన్సిపల్ శారద, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో గౌతమి స్కూల్ విద్యార్థులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here