మియాపూర్ లో ఘనంగా కమ్మ సంఘం వనభోజనాలు

  • అలరించిన ఆటల పోటీలు
  • ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్యే గాంధీ, కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్, మొవ్వ సత్యనారాయణ తదితరులు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో 6వ వనభోజన మహోత్సవం వేడుకగా జరిగింది. మియాపూర్ లోని విశ్వనాధ్ గార్డెన్స్ లో నిర్వహించిన వన భోజనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు మొవ్వ సత్యనారాయణ , ప్రముఖ పారిశ్రామికవేత్త కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవ రమేష్ , లయన్ ఘట్టమనేని, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని, అడుసుమిల్లి శ్రీనివాస్, సినిమా నిర్మాత అంకమ్మ చౌదరి మియాపూర్ కమ్మ సంఘం అధ్యక్షులు డిఎస్ఆర్ కె ప్రసాద్ హాజరై ఉసిరి చెట్టుకు పూజలు చేశారు.

వన భోజనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ తదితర ప్రముఖులు

ఈ సందర్భంగా పిల్లలకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కమ్మ సంఘం నాయకులు లీలా ప్రసాద్, పరమేష్, రామచంద్ర మూర్తి, బొబ్బ సురేష్ , గిరి, ప్రసాద్, సత్యనారాయణ, చౌదరి, సాంబయ్య, రాజేంద్రప్రసాద్ కమ్మ కుటుంబ సభ్యులు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here