సమిష్టిగా కాలనీ అభివృద్ధికి పాటుపడాలి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లోని CBR ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి , అభినదించారు, శుభాకాంక్షలు తెలిపారు. CBR ఎస్టేట్స్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి పాటుపడాలని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో CBR ఎస్టేట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రావు ప్రసాద్, జనరల్ సెక్రటరీ వెంకట రాము, ట్రెజరర్ విశ్వాస్ కుమార్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కి పూల బొకే అందిస్తున్న CBR ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here