నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, అనాధికారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీపావళి దివ్యకాంతుల వేళ అష్ట లక్ష్మీ దేవతలు అందరి ఇళ్లల్లో కొలువుతీరి సకలశుభాలు, సాహసోపేతమైన విజయాలు, సిరి సంపదలను, సుఖసంతోషాలను, బోగభాగ్యలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబం వెలుగొందేలా భారతీయ పండుగలు ఉంటాయని, ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి అని అన్నారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి అని నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని, చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు అని అన్నారు. అదేవిదంగా సుఖసంతోషాలతో, కుటుంబ సభ్యుల మధ్య అనందదాయకంగా పండుగను జరుపుకోవాలన్నారు.