బిజెవైఎం అధ్వర్యంలో ఘనంగా సంబరాలు

నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ బిజెవైఎం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ చౌరస్తాలో బిజెవైఎం హఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు తో భవిష్యత్తులో పార్టీ మరింత పుంజుకోనుందన్నారు. అందరి సమిష్టి కృషితో ఈటల గెలుపు సాధ్యమైందని, ఈటల గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓల్డ్ హఫీజ్ పేటలో సంబరాలు జరుపుకుంటున్న బిజెవైఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here