పాఠ‌శాల భ‌వ‌నంపై నుంచి కింద‌కు దూకి విద్యార్థి ఆత్మ‌హ‌త్య

శేరిలింగంపల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పాఠ‌శాల ప్రిన్సిపాల్ వేధింపులు తాళ‌లేక 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థి స్కూల్ భ‌వనం పై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని సెయింట్ మార్టిన్ హై స్కూల్‌లో 10వ త‌ర‌గ‌తి విద్య‌ను అభ్య‌సిస్తున్న రిజ్వాన్ అహ్మ‌ద్ శ‌నివారం పాఠ‌శాల భ‌వ‌నం పైనుంచి కింద‌కు దూకాడు. దీంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఉద్భవ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అత‌న్ని ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే రిజ్వాన్ మృతి చెందిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు రిజ్వాన్ అహ్మ‌ద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళ‌లేకే రిజ్వాన్ అహ్మ‌ద్ ఆత్మ‌హ‌త్య చేసుకుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రిజ్వాన్ అహ్మద్ (ఫైల్)
రిజ్వాన్ మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here