శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, నెహ్రూనగర్ లో సోమవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, యూజీడీ పైపులైన్, మంజీరా పైపులైన్ పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన వెంట నాగప్ప, కిష్టయ్య, ప్రభాకర్, యాదాగౌడ్, గఫూర్, గోపాల్, బాబూరావు, నాగేశ్వర్ రావు, స్వామి, వెంకటేష్ చారి, పద్మ, కమలమ్మ, స్వరూప, గీత రవీందర్ తదితరులు ఉన్నారు.
