డివిజన్ లో ఇంటింటికి నీరు అందించడమే లక్ష్యం: కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

స్థానిక సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ జగదీశ్వరగౌడ్

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని ఇంటింటికీ అందించాలనే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగిందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం మదీనగూడా గ్రామంలో స్థానిక నాయకులతో పర్యటించిన జగదీశ్వర్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న మంజీర పైపులైన్ పనులను పరిశీలించారు. అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ బస్తీలో స్థానికులతో మాట్లాడారు. ప్రతి ఆదివారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటు, ఇంట్లో ఉన్న పూల మొక్కల కుండీలను శుభ్రం చేసుకుని, నీటి నిల్వలను శుభ్రం చేసుకోవాలని, మన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రజలను కోరారు. హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ లలో కొన్ని చోట్లా పెండింగులో ఉన్న పైప్ లైన్ పనులు మరియు జంక్షన్ పనులు పూర్తి చేసి ప్రజలకు మంచి నీరు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలరాజు యాదవ్, జనార్దన్ గౌడ్, యాదగిరి, శేఖర్, ఆంజనేయులు యాదవ్, సాయి యాదవ్, బాబుమోహన్ మల్లేష్, నవీన్ యాదవ్, వెంకట్ రెడ్డి, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దోమల నివరణపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here