ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బి.సి. ఐక్య వేదిక సదస్సు

నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బి.సి. ఐక్య వేదిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్, పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంత్ రావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని సూచించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. వీరితోపాటు మాజీ బీసీసీ అధ్యక్షులు నందిగంటి శ్రీధర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, ముత్యం రెడ్డి, శశికాంత్, కాటా నరసింహ గౌడ్ పోచయ్యా, మరెళ్ల శ్రీనివాసరావు ఇతర ముఖ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here