సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి డివిజన్ దీనబంధు కాలనీ, హనుమాన్ నగర్ లో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బిజెపి నాయకుల కోరిక మేరకు కూకట్ పల్లి డివిజన్లో పర్యటించానని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం చిత్తారమ్మ టెంపుల్ వద్ద ఉద్యోగులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, గుంతల రోడ్లు, పొంగుతున్న డ్రైనేజీలు, వంగిన కరెంటు స్తంభాలు ఇలా అనేక సమస్యలు గుర్తించానని పేర్కొన్నారు. ముఖ్యంగా హనుమాన్ నగర్ లో సీసీ కెమెరాలు లేక దొంగల బెడద, హత్యలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాదులో లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం… ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించచారు. ఈ సమస్యను స్థానిక సి.ఐకి కూడా తెలిపామని, ప్రజా సమస్యలపై బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మనోజ్, శ్రీహరి యాదవ్, తిరుపతి రెడ్డి, బాలు యాదవ్, మురళి, శ్రీకాంత్ యాదవ్, సాయి, నరేష్ రాజు , కళ్యాణ్, శ్రీనివాస్, శ్రీలత, లలిత రెడ్డి, అరుణ పాల్గొన్నారు.

కూకట్ పల్లి డివిజన్ దీనబంధు కాలనీ, హనుమాన్ నగర్ లో పర్యటించి సమస్యల ఉదృతిని తెలుసుకుంటున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here