సీఎంఆర్ఎఫ్  చెక్కులు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. రూ. 76 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్  చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.

బాధిత కుటుంబాలకి సీఎంఆర్ ఎఫ్  చెక్కులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కాజాగుడా కి చెందిన మహమ్మద్ బురాన్ కి రూ. 60 వేలు, మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కి చెందిన గోపాలమ్ కి రూ. 16వేలు మంజూరైనట్లు ప్రభుత్వం విప్ గాంధీ తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పెర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్,సైదేశ్వరరావు, నరసింహారాజు,ఆనంద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here