సమాజ సేవే శ్రీ కృష్ణా యూత్ మార్గం

  • శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికం నగర్ లక్ష్మీ అపార్ట్ మెంట్ సభ్యుల విన్నపం మేరకు కృష్ణ యూత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చుతో చిన్నారులకు గ్రౌండ్ లో క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారు.

టెలికం నగర్ లక్ష్మీ అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను ప్రారంభిస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు.

చిన్నారులతో..

నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని, సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని, శ్రీ కృష్ణ యూత్ 1998 సంవత్సరం నుంచి సమాజ నిర్మాణానికి, ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here