వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు

  • చందానగర్ లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజలు
  • పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి భక్తిని చాటిన ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి.

అభిషేకం చేస్తున్న ఆలయ ఆచార్యులు

ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ భవానీశంకర స్వామికి ఉదయం 4.00 లకు నమక చమక సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ మహా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవగా.. హారతి తీర్థ ప్రసాదములు అందజేశారు. అభిషేకం పాల్గొన్న భక్తులకు సత్కారం లభించింది. అంతకుముందు భక్తులు భక్తి శ్రదలతో కారిక పౌర్ణమి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకొని హరిహరుల కృపకు పాత్రులయ్యారు.

అభిషేకం కార్యక్రమాన్ని తిలకిస్తున్న భక్తులు

ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, సేవాసమితి సభ్యులు, అశేష భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అభిషేకం వీక్షించి స్వామి వారి హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here