ప్రజలకు రక్షణ కల్పించండంలో ఎల్లప్పుడూ ముందుంటాం : మాదాపూర్ డిసిపి శిల్పవల్లి

  • ప్రజల భద్రతే లక్ష్యంగా.. మాదాపూర్ డీసీపీ వినూత్నంగా సైకిల్ ప్యాట్రోలింగ్
  • మదీనాగూడ, ఉషోదయ కాలనీ ప్రాంతాలలో సందర్శన
మదీనాగూడ, ఉషోదయ కాలనీ ప్రాంతాలలో సైకిల్ ప్యాట్రోలింగ్ చేస్తున్న మాదాపూర్ డీసీపీ

నమస్తే శేరిలింగంపల్లి: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. ప్రజలకు రక్షణ అందించడం కోసం  ప్యాట్రోలింగ్ వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అది తమ బాధ్యత అని వినూత్నంగా ఒక అడుగు ముందుకేశారు.

సైకిల్ ప్యాట్రోలింగ్ కార్యక్రమంలో సైక్లిస్ట్ రవితో డిసిపి శిల్పవల్లి

మియాపూర్ పరిధిలో పలు కాలనీ లో ఆమె స్వయంగా సైకిల్ తొక్కుతూ మదీనాగూడ, ఉషోదయ కాలనీ ప్రాంతాలను సందర్శించారు. ప్రజల భద్రతే తమ ప్రాముఖ్యత అని, దానికోసమే వినూత్నరీతిలో సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో పలు సైక్లిస్ట్ లు, మియాపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సైక్లిస్టల బృందంతో మియాపూర్ పోలీస్ సిబ్బంది, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here