నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డు పనులను జీహెచ్ఎంీ అధికారులు, కాలనీవాసులతో కలిసి పరిశీలించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-6.14.39-PM-scaled.jpeg)
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, కాలనిలల్లో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ నాయకులు వరలక్ష్మి, మాదవి కాలనీవాసులు పాల్గొన్నారు.