ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయం

  • సీసీ రోడ్లు, యుజిడి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, దిప్తిశ్రీ నగర్ కాలనీలలో నూతనంగా నిర్మించబోయే సిసి రోడ్లు, (యూజీడీ) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులు చేపట్టబోయే పరిసర ప్రాంతాలను GHMC అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ముఖ్యంగా డ్రైనేజి, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో విడతలవారీగా పరిష్కరిస్తామని, కాలనీలలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ, శివప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్లు నవీన్, రఘు, కాలనీ వాసులు సీతరామయ్య, శేఖర్, శివ, అవినాష్, అనిల్, వినోద్, వెంకటేశ్వరరావు, బబ్లూ, రఘు, నాగరాజు పాల్గొన్నారు.

సీసీ రోడ్లు, యుజిడి పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here