- కెనారి ద స్కూల్ లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు భాషా దినోత్సవ వేళ..ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగుదనం గొప్పదనాన్ని, దాని ప్రాముఖ్యతను చక్కగా వివరించారు కెనారి ద స్కూల్ విద్యార్థులు.
ఆ స్కూల్ లో నిర్వహించిన పలు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తెలుగుతనం ఉట్టి పడేలా వస్త్రదారణ, భాష గొప్పతనం తెలియజేస్తూ పాడిన పాటలు, గేయాలు అందరినీ అబ్బురపరిచాయి. పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా పాల్గొని కృష్ణ శాస్త్రి రాసిన ఒక చక్కని పాటతో భాష గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా చక్కని పూలతో అలంకరించిన పూకొల్లం, కైకొట్టికలి నృత్యం విద్యార్థులను అలరించాయి.