కారు గుర్తుకే ఓటేద్దాం.. బీఆర్ఎస్ ను గెలిపిద్దాం

  • ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమని శ్యామల దేవి, కార్పొరేటర్ ఉప్పలపాటి

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమని ఆరెకపూడి శ్యామల దేవి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని వారు మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో రూ. 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు, మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎనలేని కృషి చేశారని భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఈ విజయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని , సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం అని,బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ విజయం సాధిస్తుందని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు.

కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here