ప్రజా సమస్యలు తీరాలంటే బిజెపి అధికారంలోకి రావాలి

  • 60వ రోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలపై చేపట్టిన బిజెపి గడపగడపకు పాదయాత్ర 60వ రోజుకు చేరుకుంది. మియాపూర్ డివిజన్ జెపి నగర్, డీకే ఎన్ క్లౌ, శ్రీ సాయిరాం కాలనీ లలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్ స్థానిక నేతలతో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు పార్కుల పరిస్థితి, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, పాడైన రోడ్లు, మంజీరా వాటర్ బిల్లు అధికంగా వస్తున్నాయని రవి కుమార్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తెలంగాణ ప్రభుత్వం పార్కులను అభివృద్ధి చేస్తామని హరితహారం పేరుతో వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని రవి కుమార్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, వినోద రావు, వినోద్ యాదవ్, బండప్ప, సాయి, సోమశేఖర్ గౌడ్, గణేష్ , రాజేష్ గౌడ్, బాబు ముదిరాజ్, సురేష్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here