నిరుపేద మహిళలకు జీవనోపాధి కల్పిస్తాం : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

  • బీజేపీలో చేరిన మహిళలు.. సాదరంగా ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం హయంలో తగినంత గౌరవం దక్కలేదని, అన్ని రంగాలలో నమ్మించి మోసం చేసి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఎద్దేవ చేశారు. అయితే ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు బిజెపి పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ .. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేద మహిళలకు జీవనోపాధి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు బిజెపి తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఇంటికి పంపించి ప్రజల కోసం పనిచేసే నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. పార్టీలో చేరిన వారు అనూష, లక్ష్మి, దుర్గమ్మ, శాంతమ్మ, నవనీత, మౌనిక, పద్మ, పార్వతీ, రమా, విజయ, దివ్య, రాధా, లక్ష్మి, రమాదేవి, దేవేంద్ర, రజియమ్మ, స్రవంతి, విజయమ్మ, సరోజ, దేవి, సంధ్య నరసమ్మ, గంగారమ్మ, కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బిజెపి పార్టీ నాయకులు రామరాజు, కుమార్ యాదవ్, నరేందర్ రెడ్డి, స్రవంతి, నరసింహ చారి, సందీప్ గౌడ్, భూపాల్ రెడ్డి రామ్ రెడ్డి రమేష్, బాలు యాదవ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here