- కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొని భోగి మంటలు వేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహల మధ్య భోగి పండగను జరుపుకోవాలనీ ఎమ్మెల్యే ఆరేకపుడి గాంధీ అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు , కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ భోగి రోజున తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ అని, ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు అని. అంతే కాకుండా ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారని , పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం అని ఎమ్మెల్యే గాంధీ తెలియజేసారు.