వేడుకగా అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ బలరాం యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవం వేడుకగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప కరుణా, కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని వేడుకున్నారు. అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమోహన్ రావు, హన్మంత్ రెడ్డి, రమేష్ యాదవ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

శ్రీరామ్ నగర్ కాలనీలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్ సన్మానించిన కాలనీ ప్రెసిడెంట్ బలరాం యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here