సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీక రంజాన్ : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

  • ఆదిత్య నగర్ లోని ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధన

నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని ఎమ్మెల్యే గాంధీ అభిలాషించారు. ఈద్ – ఉల్- ఫితర్ సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లోని ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర మాస రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఆదిత్య నగర్ లోని ఈద్గా వద్ద ముస్లిం పెద్దలతో కలిసి సామూహిక ప్రార్ధన చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత తెలియజేస్తుందని వివరించారు. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.

ముస్లిం మతపెద్దలు, సోదరులతో ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, ఖాసీం, లియాకత్, బాబు మియా, అబ్దుల్ రహమాన్, సలీం, మియన్ పటేల్, మామిడల రాజు, రాజయ్య ఆంకారవు, కాజా, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here