శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 30 నామినేషన్లు

రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేస్తున్న జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు రెండు సర్కిళ్లలో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. రెండవ రోజైన గురువారం 30 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లకు గానూ మొత్తం 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లను సమర్పించారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ డివిజన్ ల నుండి 15 మంది అభ్యర్థులు 18 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా టిఆర్ఎస్ నుండి 8 మంది , బిజెపి నుండి 9 , కాంగ్రెస్ నుండి ముగ్గురు, టిడిపి నుండి ఒకరు , ఎంసిపిఐయూ నుండి ఒకరు, స్వతంత్రులు నలుగురునామినేషన్లు దాఖలు చేశారు.

శేరిలింగంపల్లి టి ఆర్ఎస్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న రాగం నాగేందర్ యాదవ్
హఫీజ్ పేట్ స్థానానికి టీఆరెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న పూజిత జగదీశ్వర్ గౌడ్

అధికార టిఆర్ఎస్ పార్టీ తరపున కొండాపూర్ డివిజన్ నుండి షేక్ హమీద్ పటేల్, గచ్చిబౌలి డివిజన్ నుండి కొమిరిశెట్టి సాయిబాబా, శేరిలింగంపల్లి డివిజన్ నుండి రాగం నాగేందర్ యాదవ్ లు నామినేషన్ వేశారు. వీరితో పాటు కొండాపూర్ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా బిజెపి గచ్చిబౌలి అభ్యర్థిగా గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి అభ్యర్థిగా ఎల్లేష్ లు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా కొండాపూర్ డివిజన్ నుండి సయ్యద్ రియాజ్, గచ్చిబౌలి డివిజన్ నుండి వెంకట బాలకృష్ణ మూర్తి పెరి, రావులకొల్లు శ్రీకాంత్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.

గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి టీఆరెస్ అభ్యర్థిగా రాష్ట్ర నాయకులు కడియం శ్రీహరితో కలిసి నామినేషన్ వేస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా

టీఆరెస్ పార్టీ తరపున మాదాపూర్ అభ్యర్థి గా వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట్ అభ్యర్థి గా వి, పూజిత జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ అభ్యర్థి గా ఉప్పలపాటి శ్రీకాంత్, టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి గా బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, చందానగర్ డివిజన్ నుండి సునీత ప్రభాకర్ రెడ్డి నామినేషన్ లు వేశారు.

కొండాపూర్ టీఆరెస్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న హమీద్ పటేల్

బిజెపి పార్టీ తరపున మియాపూర్ అభ్యర్థి గా డిఎస్ఆర్ కె ప్రసాద్, హఫీజ్ పేట్ అభ్యర్థి గా బోయిని అనూష యాదవ్, చందానగర్ డివిజన్ నుండి కే. సరితా బుచ్చిరెడ్డి, నాగం సౌజన్య రాజశేఖర్, మాదాపూర్ డివిజన్ నుండి గంగుల రాధాకృష్ణ యాదవ్, పొల్ల కృష్ణ వినయ్ బాబు లు నామినేషన్ లు దాఖలు చేశారు.

శేరిలింగంపల్లి బిజెపి అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్న ఎల్లేష్
మియాపూర్ బిజెపి అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్న డిఎస్ఆర్ కె ప్రసాద్

ఎంసిపిఐ యు మియాపూర్ అభ్యర్థి గా పల్లి మురళి, కాంగ్రెస్ పార్టీ నుండి మియాపూర్ అభ్యర్థి గా మహమ్మద్ ఇలియాజ్ షరీఫ్, టిడిపి నుండి మియాపూర్ అభ్యర్థి గా బొందలపాటి సుధాకర్, మియాపూర్ స్వతంత్ర అభ్యర్థి గా మూలగురి వెంకట జ్ఞానేంద్ర ప్రసాద్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.

మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న ఇలియాజ్ షరీఫ్
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here